Skip to main content

శ్రీకృష్ణుని భార్యలు


 

శ్రీ కృష్ణునికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్రాదేవి,లక్షణ అని పిలువబడే ఎనిమిది మంది భార్యలు కలరు. వీరినే “అష్టమహిషులు” అని కూడా పిలువబడుతారు.

రుక్మిణి దేవి:
విదర్భ రాజు భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణి దేవి శ్రీ కృష్ణుడిని గురించి విని అతడిని ఎంతగానో ప్రేమిస్తుంది. రుక్మిణీ దేవి యిష్టానికి వారి పెద్దలు అంగీకారం తెలపగా, ఆమె సోదరుడు రుక్మి మాత్రం తన స్నేహితుడైన శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించి, ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. అయితే రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడి సహాయంతో శ్రీ కృష్ణునికి తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే వచ్చి తనని చేపట్టమని సందేశాన్ని పంపుతుంది. పిమ్మట రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగర పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వచ్చే సమయంలో రుక్మిణి దేవిని ఎత్తుకొచ్చి, ద్వార‌క‌లో వివాహం చేసుకుంటాడు.

జాంబవతి:
సత్రాజిత్తు అను రాజు సూర్యుడి అనుగ్రహంతో రోజుకు పదహారు బారువుల బంగారం ప్రసాదించే శమంతకమణి అనే అద్భుతమైన మణిని పొందినాడు. ఆ శమంతక మణిని తనకు ఇవ్వమని శ్రీ కృష్ణుడు కోరగా, అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. అదే సమయంలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని ధరించి వేటకు వెళ్ళగా, ఆ మణిని మాంసమని అనుకుని అతనిని ఒక సింహము చంపి మణిని తీసుకొని పోయింది. సింహము నోటిలో వున్న మణిని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఆ మణిని ఇచ్చాడు. శమంతక మణి ఇవ్వని కారణంగా శ్రీ కృష్ణుడే ప్రసేనుడిని చంపి, శమంతక మణిని దొంగిలించాడని అపవాదు ప్రచారం చేశారు. ఆ అపవాదు మాపుకొనుటకు శ్రీ కృష్ణుడు తన సైన్యంతో ప్రసేనుడి జాడ వెదుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడి కళేబరం ఇంకా సింహపు అడుగు జాడలు కనిపించగా, వాటిని అనుసరిస్తూ జాంబవంతుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ జాంబవంతునితో 12 రోజులు యుద్దము చేసినాడు. యుద్ధం లో అలసిపోయిన జాంబవంతుడు శ్రీ కృష్ణుడు సాక్షాత్తు శ్రీ రాముడని తెలుసుకున్న జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసాడు.

సత్యభామ:
శ్రీ కృష్ణుడు జాంబవంతుడి దగ్గర వున్న శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చేను. పిమ్మట జరిగిన విషయాన్ని తెలుకొని, అనవసరమైన అపవాదు శ్రీకృష్ణునిపై వేసినందుకు సత్రాజిత్తు విచారించెను. శ్రీ కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేసెను.

కాళింది :
సూర్యుని కుమార్తె అయిన కాళింది శ్రీ మహా విష్ణువుకు భార్య అవ్వాలని ఘోరమైన తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చి కృష్ణావతారంలో ఆమె కోరిక తీర్చేనట్లుగా వరం ప్రసాదిస్తాడు. పిమ్మట ఆమె మరో జన్మ ఎత్తి శ్రీ కృష్ణుడిని వివాహం చేసుకుంటుంది.

మిత్రవింద:
శ్రీ కృష్ణుని ఐదుగురు మేనత్తలలో ఒకరైన “రాజాథిదేవి” అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. వీరి కుమారులు విందానువిందులు, మరియు కుమార్తె మిత్రవింద. తన అన్నల కోరికకి వ్యతిరేకంగా మిత్రవింద స్వయంవరంలో శ్రీ కృష్ణుని వరించి వివాహం చేసుకుంటుంది.

నాగ్నజితి:
నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. కోసల రాజ్యములో ఏడు వృషభములు (ఎద్దులు) మదించిన ఏనుగుల వలె ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోవడంతో నాగ్నజిత్తు ఎవరైతే ఈ వృషబాలను బంధిస్తారో వానికి తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీ కృష్ణుడు ఆ ప్రకటన విని ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

భద్రాదేవి:
శ్రీ కృష్ణుని ఐదుగురు మేనత్తలలో ఒకరైన “శృతకీర్తి (శృతసేన)” కేకయ దేశపు రాజు దృష్టకేతు భార్య. వీరికి సంతర్థనుడూ అనే కుమారుడు, భద్ర అనే కుమార్తె కలరు. పెద్దల సమక్షం‌లో భద్రాదేవిని వివాహమాడాడు.

లక్షణ (లక్ష్మణ) :
మద్ర రాజ్యానికి రాజైన బృహత్సేనుని కుమార్తె లక్షణ. ఈమెకు వివాహం చేసేందుకు తండ్రి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఆ మత్స్య యంత్రాన్ని చేధిస్తారో వానికి తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీ కృష్ణుడు ఆ మత్స్య యంత్రాన్ని చేధించి, స్వయంవరంలో లక్షణను వివాహం చేసుకుంటాడు.

ఈ అష్ట మహిషులే కాకుండా పదహారు వేల మంది (కొన్ని గ్రంథాలలో పదహారు వేల ఒక వంద అని ఉన్నది) కృష్ణుడి భార్యలు వున్నట్లుగా హిందూ పురాణాలు చెపుతాయి. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి ఈ పదహారు వేల మంది భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించి, నరకాసురుని చెరలో ఉన్న పదహారు వేల మంది గోపికా స్రీలను విడిపించినాడు. "భర్త అనగా భరించువాడు" అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...