Skip to main content

వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ విశిష్టత

హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని “వైశాఖ పూర్ణిమ” అని పిలుస్తారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు.

భవిష్య పురాణం ప్రకారం అమృతం కోసము దేవతలు, రాక్షసులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగర మథనం ప్రారంభించారు. అప్పుడు మందర పర్వతం తన బరువుకు సముద్రంలో మునిగిపోవడంతో వారు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించగా, వారి ప్రార్థనలు మన్నించిన శ్రీ మహా విష్ణువు కూర్మ అవతారం రూపం దాల్చి పాల సముద్రం అడుగున ఉన్న మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ పైకి లేపాడు. కూర్మ రూపంలో శ్రీ మహా విష్ణువు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజును “ కూర్మ జయంతి” అంటారు.

అలాగే శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడి కోరికపై నృసింహ‌ అవతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించింది కుడా ఈ వైశాఖ పూర్ణిమ రోజే.


ఈ వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. అహింసే పరమ ధర్మమని బోధించిన మహనీయుడు బుద్ధుడు కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు ప్రాచీన భారతదేశంలో భాగమైన లుంబినీ (ప్రస్తుతం నేపాల్‌లో ఉంది)లో సిద్దార్ధునిగా జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కులీన శాక్య వంశానికి చెందిన సుద్దోదన మహరాజు, రాణి మాయదేవి. అయితే గౌతముడు పుట్టిన కొన్ని రోజులకే ఆమె తల్లి మరణించగా, పిన తల్లి గౌతమి అనే మహిళ పెంచడం వలన గౌతముడనే పేరుతో కూడా పిలుస్తారు. యాదృచ్ఛికంగా చాలా రోజుల తరువాత వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థుడికి గయలోని బోధి (రావి) చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా ప్రసిద్ధిగాంచాడు. అందువల్లే వైశాఖ పూర్ణిమ “బుద్ధ పూర్ణిమ”గా ప్రసిద్ధి చెందింది. అలాగే మరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు.

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలు బౌద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోధ్ గయ మరియు వారణాసి సమీపంలో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్ మరియు బుద్ధుడు మరణించిన కుషినగర్‌లలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

నేటికి రెండున్నర వేల సంవత్సరములు గడిచినా ఇంకా ఈ నాటికి కూడా బుద్దుడు తన అహింస ధర్మముతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక, బర్మా, థాయ్‌లాండ్, టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా, భూటాన్, కాంబోడియా, నేపాల్, జపాన్ పలు దేశాల్లో బౌద్ధం విస్తరించి విరాజిల్లుతోంది.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...