Skip to main content

జరాసంధుని ఇతివృత్తం

జరాసంధుడు మహాభారతంలో ఒక విచిత్రమైన పుట్టుక కలిగినవాడు. కృష్ణుడంతటి వాడిని జయించిన వీరుడు జరాసంధుడు. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు - ఈ అయిదుగురు ఒకే నక్షత్రంలో జన్మించడం వలన వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు. ముందుగా బకాసురుడు పాండవులు ఏకచక్రపురంలో నివసిస్తున్న సమయంలో భీముని చేతిలో సం‌హరింపబడగా, క్రమంగా మిగిలిన ముగ్గురు భీమునిచే వధింపబడినారు.

జరాసంధుని పుట్టుక:

మగధ దేశానికి రాజైన బృహద్రధుడుకి ఇద్దరు భార్యలు. వారి వలన అతనికి సంతానము లేకపోవడంచో, బృహద్రధుడు సంతానం కొరకు చందకౌశిక అనే మహర్షిని ప్రార్ధించెను. ఆ ఋషి బృహద్రధునికి ఇద్దరు భార్యలు అని తెలియక, ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. ఆ పండును బృహద్రధుడు తన ఇద్దరు భార్యలకు సమానంగా విభజించి తినిపించాడు. పండు సగ భాగాల్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు కొంతకాలానికి శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దిగ్భ్రాంతికి గురైన మహారాజు ఆ శిశు భాగాలను బయట పడవేసి రమ్మని తన సేవకులను ఆదేశించగా, ఆ సేవకులు బయట విసిరివేస్తారు.

ఆ రాజ్యములో జరా అనే పేరుగల ఒక రాక్షస మహిళ ఈ రెండు భాగాలను ఒకటిగా చేసి కలిపి తినడానికి ప్రయత్నించిగా, ఆ శిశువుకి ప్రాణం వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ రాక్షసి జరిగిన విషయాన్ని రాజుకి చెప్పి ఆ పిల్లాడిని అప్పగించి “అతని శరీరాన్ని విభజించి వ్యతిరేక దిశలో విసిరి వేస్తే తప్ప, ఎవరూ సంహరించలేరు” అనే వరాన్ని కూడా ప్రసాదించింది. జరా అనే రాక్షసి చేత సంధించబడ్డాడు కాబట్టి రాజు కృతజ్ఞతతో ఆ పిల్లవాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు.

తండ్రి అరణ్యవాసానంతరం జరాసంధుడు మగధ దేశానికి రాజయ్యాడు. సహజంగానే మల్ల యుద్ధ ప్రవీణుడైన జరాసంధుడు మహా బలవంతుడు మరియు పరమ శివ భక్తుడు. తన రాజ్యమున శత్రువులు ఎవరైనా ప్రవేశిస్తే దానంతటదే మోగే భేరీపటలము ఏర్పాటు చేసి, తన రాజ్యములో ప్రవేశించిన శత్రువులను అంతము చేసేవాడు. తన కుమార్తెలు అయిన అస్తీ, ప్రాస్తీ లిద్దరిని కంసునికిచ్చి వివాహంచేసి కంసున్ని అల్లునిగా చేసుకున్నాడు. కంసున్ని చంపిన శ్రీ కృష్ణుని సంహరించే క్రమంలో భాగంగా జరాసంధుడు పదిహేడు సార్లు యుద్ధానికి ప్రయత్నించి ఓడిపోయాడు. అంతిమంగా పద్దెనిమిదవసారి మాత్రం శ్రీ కృష్ణుని ఓడించి పగ తీర్చుకున్నాడు.

ధర్మరాజు రాజసూయ యాగము చేయుటకు నిశ్చయించుకొని శ్రీ కృష్ణునికి అగ్ర తాంబూలం అంటే మహా చక్రవర్తిగా ప్రకటించి పూజించాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వడాన్ని అంగీకరించని జరాసంధుడుని సం‌హరించుటకు ధర్మరాజు కృష్ణుని సహాయం కోరెను. శ్రీ కృష్ణుడు భీమార్జునులతో కలసి బ్రాహ్మణ వేషమున జరాసంధుని వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణ భక్తి కలిగిన వచ్చిన వారిని బ్రాహ్మణులనుకొని జరాసంధుడు వారికి నమస్కరించి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అంతట శ్రీ కృష్ణుడు తాము బ్రాహ్మణులం కాదని అసలు విషయం చెప్పి తమతో మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు. మల్ల యుద్దం నాలుగు రోజుల పాటు భీకరంగా కొనసాగగా, భీముడు జరాసంధుని సంహరించలేకపోయాడు. శ్రీ కృష్ణుడు జరాసంధుని సంహరించడానికి సూచనగా భీమునికి కనపడేలా ఒక గడ్డి పరకను రెండు ముక్కలుగా చేసి వ్యతిరేక దిశలలో విసిరేశాడు. శ్రీ కృష్ణుని సూచనతో భీముడు జరాసం‌ధుడి శరీరాన్ని రెండు సగాలుగా చీల్చి, రెండు భాగాలను వేర్వేరు దిశల్లో విసిరి వాటిని తిరిగి కలుసుకోనివ్వకుండా చేసి సంహరించాడు. రెండు భాగాలు కలిసి ప్రాణాన్ని పొందిన జరాసంధుడు రెండుగా విడిపోయి మరణించాడు.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...