Skip to main content

అప్సరస: తిలోత్తమ

తిలోత్తమ దేవెంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. ఈమె పుట్టుక గురించి ఒక ఆసక్తిగల కధ ఉంది. పూర్వం రాక్షసుడైన హిరణ్యకశిపుని వంశాన పుట్టిన నికుంభుడు అనే రాక్షసరాజుకి సుందుడు, ఉపసుందుడు అని ఇద్దరు కుమారులు కలరు. వీరిరువురూ ఎంత అన్యోన్యంగా ఉండటం వలన వారిద్దరినీ కలిపి ‘సుందోపసుందులు’ అని ఒకే పేరుతో వ్యవహరించేవారు. ప్రపంచమంతా జయించాలన్న కోరికతో వింధ్యా పర్వతం మీద ఘోర తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మ దేవుడు సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమనగా “మాకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోవాలి. ఏ మాయ చేయాలంటే ఆ మాయను చేయగలగాలి. అంతేకాక ఎవరివల్లా మాకు మరణం లేకుండా అమరత్వాన్ని ప్రసాదించమని” కోరారు. అంతట బ్రహ్మ దేవుడు “అన్యులచే (పరులచే) మీకు మరణం రాదు” అని వరమిచ్చి అదృశ్యుడైనాడు.

బ్రహ్మ దేవుని వరంతో రాక్షసులైన సుందోపసుందుల ఆగడాలకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారిని ఎదిరించే వారు ఎవ్వరూ లేకపోవడంతో వీరు ముల్లోకాలను జయించి దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులను హింసించసాగెను. వీరి అకృత్యాలకు ముల్లోకాల వాసులంతా హడలిపోయారు. దీంతో దిక్కుతోచని దేవతలు, రుషులు బ్రహ్మ దేవుని ప్రార్ధించగా, ‘అన్యుల చేతుల్లో వారికి మరణం ఉండదని వరమిచ్చిన మాట నిజమే కాని వారిలో వారు కొట్టుకు చచ్చే అవకాశం ఉందని’ పలికెను. మరి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్యోన్యంగా ఉండే సోదరుల మధ్య ముసలం పుట్టించేదెలా! అందుకోసం బ్రహ్మ దేవుడు ఆలోచించి విశ్వకర్మను పిలిచి లోకములోకెల్లా సౌందర్యవతి అయిన ఒక కన్యను సృష్టించమని చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆజ్ణానుసారం ముల్లోకాలలో ఉన్న అన్ని అందమైన రూపాలలో ఒక్కొక్క దాని నుంచి నువ్వు గింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఒక అద్భుత సౌందర్యరాశిని సృష్టించగా, బ్రహ్మ దేవుడు ఆమెకు ప్రాణప్రతిష్ట చేసెను. “తిలా” అనగా నువ్వు గింజ మరియు “ఉత్తమ” అంటే అత్యుత్తమమైనది అని అర్ధం. నువ్వు గింజ పరిమాణంలో తీసి అత్యున్నత లక్షణాలతో ఆమె శరీరాన్ని నిర్మించుట చేత బ్రహ్మ ఆమెకు ‘తిలోత్తమ’ అని నామకరణం చేసెను. అంతట ఆ సుందరి లేచి నమస్కరించి తన సృష్టికార్యం ఏమిటని అడగగా, నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం వచ్చి ఇద్దరూ ఒకరినొకరు సంహరించుకోవాలని చెప్పెను.

అంత బ్రహ్మా ఆదేశంతో తిలోత్తమ వెళ్లి సుందోపసుందుల కంటపడేలా సంచరించింది. తిలోత్తమ అందాన్ని చూసి మోహితులైన సుందోపసుందుల అమె నాదంటే నాదని గొడవపడ్డారు. వారిలో క్రోధం పెరిగిపోయంది. తిలోత్తమను పొందడానికి పోటీపడి అంతవరకూ ఎంతో వాత్సల్యంతో ఉన్న ఆ సోదరులు వారి వరాలను వారు మరిచిపోయారు. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారిలో అన్నదమ్ముల మైత్రి ఆమడదూరం పోయంది. ఎవరికి వారు గొప్ప అనుకొన్నారు. పట్టుదలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకొని చివరకు ఇద్దరు మరణించారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్నదమ్ములు మధ్య మోహం అనే బలహీనత కలహానికి కారణమై వారి పతనానికి దారి తీసిందో సుందోపసుందుల కథ చెబుతోంది.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...