Skip to main content

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

1. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం |2|

2. ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ
ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు |2|

3. మాత స్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తే
శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దాన శీల
ే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం

4. తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృష శైల నాథ దయితే దయానిధే

5. అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

6. పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

7. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని భుక్త్వా సలీల మథ కేళి శుకా ః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

9. తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

10. భృంగావళీచ మకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదై స్సహ సేవనాయా నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

11. యోషా గణేన వర దధ్ని విమథ్య మానే ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

12. పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

13. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

14. శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

15. శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

16. సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

17. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

18. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

19. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

20. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

21. శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

23. కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

24. మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

25. ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం

26. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభో విహంగాః శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం

27. బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

28. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

29. ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

విష్వక్సేనుడు: శ్రీమహా విష్ణువు సర్వసైన్యాధిపతి

తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలలో విష్వక్సేనులది ప్రధాన పాత్ర. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే విష్వక్సేనుని ఎవరు ఆరాధిస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండవని వైఖానస ఆగమం చెబుతోంది. అసలు విష్వక్సేనుడు ఎవరో తెలుసుకుందాం! శైవులు గణపతిని తొలిగా పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్టుగానే వైష్ణవులు విష్వక్సేనుని ప్రతి కార్యంలోను పూజిస్తారు. శివ గణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అయితే, విష్ణు గణాలకు అధిపతి విష్వక్సేనుడు. కూర్మ పురాణం ప్రకారం విష్వక్సేనుడు చూడటానికి విష్ణుమూర్తిలాగానే ఉంటాడు. ఈయనకి కూడా నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడవ చేతి చూపుడు వేలు పైకి చూపిస్తూ ఉంటుంది, నాలగవ చేతిలో గద ఉంటుంది. తన యజమాని వలె పసుపు రంగు దుస్తులు ధరించి ఉంటాడు. శ్రీ మహావిష్ణువుకు శ్రీవత్సం ఉంటే, విష్వక్సేనుడికి అవి ఉండవు. అలాగే కాళికా పురాణం, పాంచరాత్ర గ్రంథం లక్ష్మీ తంత్రం మరియు ఇతర ఆగమ గ్రంథాలలో విశ్వక్సేనుని గురించి ప్రస్తావించబడింది. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయం‌లో ముక్కోటి ప్రదక్షిణంలో ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున విష్వక్సేనుడి ఆలయం ఉంది. సంవ...

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం.

క్రీస్తు శకం 848 వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం. పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు బలగర్వ మొప్పంగ బై లేచి సేన పట్టంబు గట్టించి ప్రభు పండరంగు బంచిన సామంత పడువతో బోయి కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి కట్టె దుర్గంబు గడు బయల్సేసి, కందుకూర్బెజవాడ గావించి మెచ్చి దీనికి ముందుగా ఎందరో మహానుభావులు పద్యాలు వ్రాసి ఉంటారు. అయితే శాసనాలు లభించిన మేరకు ఈ పద్యం మొదటిదిగ చరిత్రకారులు చెప్తూ ఉంటారు.