Skip to main content

కార్తీకమాసంలో దీపదానం

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్‌
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరం!
కార్తీక మాసమంత పవిత్ర మాసం లేనేలేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, నదీస్నానం లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే సాన్నం ఆచరించి, 'కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని విష్ణువుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అదేవిధంగా శివాలయంలో దీపా రాధన చేస్తే చాలా మంచిది. శరత్‌ రుతువులో చంద్రుడు పూర్ణిమ నాడు 'కృత్రికా నక్షత్రం దగ్గరగా రావడం వల్ల ఈ మాసం కార్తీకమాసంగా పిలువబడుతుంది. కార్తీకమాసంలో దీపదానం ఉత్తమఫలాన్ని ఇస్తుంది.

నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం కార్తీక పురాణ పఠనం, వనభోజనాలు కార్తీకమాసంలో ముఖ్యంగా జరుప వలసిన విధులు. కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీకపౌర్ణమి మొదలగు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. ఈ నెల రోజులు కార్తీకపురాణం రోజుకు ఒక అధ్యాయం పఠనం చేయడం వల్ల శివప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో దేశ వ్యాప్తంగా శివార్చనలు జరుపుతారు. శివుడు అభి షేకప్రియుడు ''అభిషేక ప్రియః శివః శివాభిషేకం అన్ని శుభాలను ప్రసాదిస్తుంది అని అర్ధం. శివునికి ''అర్కద్రోణ ప్రభృతి కుసుమైః అర్చనంతే విధేయం అనగా జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులతో శివుడిని అర్చిస్తే శివానుగ్రహం లభిస్తుంది.

ఇంకను శివుణ్ణి తులసి, మారేడు(బిల్వ) పతాల్రతో శివాలయంలో, విష్ణు ఆలయంలో సాయం సంధ్య వేళల్లో పూజించి దీపాలు పెట్టడం వల్ల దివ్యమైన ఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో స్వగృహంలో తులసీ సన్నిధిలోను, దేవాయలంలోను దీపం పెట్టడం వలన అఖండ, ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ మాసంలో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివార్చనం లేదా విష్ణుపూజ చేసి నక్షత్రదర్శనం చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కార్తీక సోమవారం శివునికి ప్రీతికరమైనది.

ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి.కార్తీకమాసంలో 'అయ్యప్ప దీక్షలు స్వీకరిస్తారు. ఈ మాసంలో ఏ దీక్ష అనుసరించినా మోక్షదాయకమే. ''కార్తీకేతు కృతదీక్షా నృణాం జన్మవిమోచనీ. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద బంధుమిత్ర సహితంగా 'కార్తీక సమారాధన నేటికీ ఆచరణలో ఉంది. విష్ణుప్రీతికై సూర్యాస్తమ య కాలమందు ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణాలలో చెప్ప బడింది.అంతేకాక, ఉసిరికాయ, అరటి దొప్ప లలో దీపాలను పెట్టి చెరువులలో, నదులలో విడి చిపెట్టి భగవదార్పణం చేయడం సాంప్రదాయం.

Comments

Post a Comment

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...