Skip to main content

వరలక్ష్మి వ్రత కథ

పూర్వం మగధ రాజ్యంలోని కుండిన అనే పట్టణంలో చారుమతి అనే పేద బ్రాహ్మణ వివాహిత ఉండేది. ఆమె తన పతికి, అత్త మామలకు భక్తి తో సేవ చేసేది. ఒక రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో శ్రీ వరలక్ష్మి దేవి కనిపించి “భక్తురాలా! నేను వరలక్ష్మి మాతను, నీ సత్ప్రవర్తనను చూసి నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్ష మయ్యాను. ఈ శ్రావణ మాస పూర్ణిమ కు ముందు వచ్చే శుక్రవారం నాడు నా పూజావ్రతం చేస్తే నీవు, నీ ఇల్లు, నీ వారు, నీ పట్టణమే కాదు, నీవు నివసించే రాజ్యం కూడా సర్వ సంపదలతో తులతూగుతుంది” అని చెప్పి అదృశ్య మయ్యింది. కళ్ళు తెరిచి చూసిన చారుమతికి అమ్మ కనిపించలేదు. వెంటనే ఆమె తన అత్త మామలతో జరిగిందంతా చెప్పగానే “ఇది ఎంతో శుభకరమైన స్వప్నం. తల్లి చెప్పినట్టుగానే మనం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నోచుకుందాం” అన్నది ఆమె అత్త.

లక్ష్మి మాత చెప్పిన రోజు రానే వచ్చింది. ఇల్లంతా పేడతో అలికి, ఇంటి నిండా ముగ్గులు పరిచి, శోభాయమానంగా తీర్చిదిద్దారు. అందరూ పట్టుబట్టలు కట్టుకుని పూజకు సిద్దమయ్యారు. ముందుగా గణపతి పూజ పూర్తి చేసి, లక్ష్మి దేవి ని ఆవాహన చేసి అష్టోత్తరాలు, షోడశోపచారాలతో, సహస్రనామార్చన గావించి నైవేద్యం పెట్టి తల్లి దీవెనలు అందుకున్నారు. ముత్తయిదువ లను పిలిచి పేరంటం ఇచ్చి, వరలక్ష్మి వ్రాత మహిమ మరియు వ్రతవిధానాన్ని వివరించారు. చారుమతి కుటుంబం, ఆ పట్టణ ప్రజలు, ఆ రాజ్య ప్రజలు అప్పటినుండి కరువు కాటకాలు లేక సమృద్ధి యైన పాడి పంటలతో చల్లగా జీవించసాగారు. అందరు స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని వేచి చూడసాగారు.

వరలక్ష్మి వ్రత కథ ను పరమేశ్వరుడు పార్వతికి వివరించినట్టు సూత మహా ముని తన శిష్యులకు వివరించెను.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

శతానంద మహర్షి

శతానంద మహర్షి భారతీయ పురాణాలలో ప్రముఖమైన ప్రాచీన మహర్షులలో ఒకరు. ఆయన గౌతమ మహర్షి మరియు అహల్యల పుత్రుడుగా జన్మించాడు. ఈ కథలో ఆయన జన్మ, బాల్యం, విద్యాభ్యాసం మరియు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకుందాం. జననం మరియు నేపథ్యం గౌతమ మహర్షి మరియు అహల్యలు తమ తపఃశక్తితో లోకానికి సేవలందించిన మహా దంపతులు. అనేక సంవత్సరాల పాటు తపస్సు తర్వాత అహల్య, మాతృత్వం పొందాలనే కోరికను వ్యక్తపరిచింది. గౌతమ మహర్షి ఆమె కోరికను నెరవేర్చుతూ, వందరకాల ఆనందాన్ని అనుభవించి పుత్రోత్పత్తి చేశారు. అందువల్ల శత రకాల ఆనందాల ద్వారా పుట్టిన బాలుడిగా ఆయనకు శతానందుడు అనే పేరు పెట్టారు. విద్యాభ్యాసం మరియు బ్రహ్మచర్యం శతానందుడు తన బాల్యంలోనే తండ్రి గౌతమ మహర్షి వద్ద వేదాలు, ఉపనిషత్తులు మరియు ఇతర శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆయన బ్రహ్మచర్యాన్ని గౌరవిస్తూ, శాశ్వత ధర్మాన్ని పాటించేవాడు. జనక మహారాజు ఆస్థాన పురోహితుడు శతానందుడి గొప్పతనాన్ని తెలుసుకున్న మిథిలా నగరపు రాజు జనకుడు, అతన్ని తన ఆస్థాన పురోహితునిగా నియమించుకోవాలని కోరాడు. గౌతమ మహర్షి శతానందుడికి పెళ్లి చేసి, అతన్ని మిథిలా పట్టణానికి పంపించారు. జనక మహారాజు శతానందుడిని తమ కుల...