/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Sunday, February 27, 2011

ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి

ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి” అని తెలుగులో ఒక సామెత ఉంది. దీనిని అదృష్టం కలిసి రాకపోతే పరిస్థితులు తారుమారై ఈ రోజు భాగ్యవంతుడు రేపటికల్లా కటిఖ ధరిద్రుడిగా కావచ్చు, ఈ రోజుటి బికారి రేపటికి భాగ్యవంతుడు కావచ్చు గనుక మనిషిని మనిషిగా గౌరవించాలి గాని ఉన్న సంపదను చూసుకుని మిడిసిపడడం తగదు అన్న అర్ధంలో ఒక హెచ్చరికగా వాడ బడుతోంది.

Saturday, February 26, 2011

మహా శివరాత్రి

మాఘమాసంలో బహుళ చతుర్ధశిని "మహా శివరాత్రి" అంటారు. మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము - అనగా గొప్ప పండుగ. చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. శివక్షేత్రములందు 'శివరాత్రి'ని పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు.

భక్తులు ఈ పండుగనాడు తెల్లవారు ఝాముననే నిద్ర లేస్తారు. ఇళ్ళలోను, గుళ్ళలోనూ కూడ శివపూజలు, శివాభిషేకములు చేస్తారు. ఈ రోజు 'ఉపవాసం', రాత్రి 'జాగరణ 'చేస్తారు. (రాత్రి అంతా మేల్కొని శివనామ స్మరణ చేస్తూ గడపడాన్ని జాగరణ అంటారు. మరునాటి ఉదయం యధావిధి స్నాన సంధ్యలు ముగించుకొని భగవంతునికి (శివునికి) అర్పించిన ఆహారాన్ని తింటారు.)

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

Thursday, February 24, 2011

ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి

కొంత మందికి ఇంట్లో వారి నుంచి తగిన గౌరవము, ఆదరణ లభించదు. కాని ఆ గౌరవము బయటి వారి నుంచి లభిస్తుంది. ఇటువంటి పరిస్తితులలో ఇంట్లో గౌరవం పొందక, బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొనే వారి గురించి "ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి" అనే సామెత చెపుతుంది.

Monday, February 21, 2011

తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది


తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా పరాల తెలుగు ఒకటేనన్నా …
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలుబండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జంచాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది … రాయలసీమ మనది … సర్కారు మనది … నెల్లూరు మనది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది


- రచన : సి.నారాయణరెడ్డి (చిత్రం :తల్లా! పెళ్లామా?)

చిరస్మరణీయుడు : సి.పి.బ్రౌన్

తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్.

1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్

1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఇంగ్లండు నుంచి ఉద్యోగరీత్యా సీపీ బ్రౌన్ తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్‌ తెలుగు అక్షరాభ్యాసం చేశారు.  1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1821లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేశారు. పాఠశా లలో  తెలుగు‌ భాష నేర్పిం చారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు. అక్కడ సైతం తెలుగును అభివృద్ధి చేసేందుకు రెండు పాఠశా లలు ఏర్పాటు చేశారు.  1824లో వెంకటశాస్ర్తి సాయంతో వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన ఘనత సిపిబ్రౌన్‌కు దక్కింది. అనంతరం 1826లో కడప రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు. నిఘంటువును అచ్చువేసేందుకు బోర్డుకు పంపారు.  బోర్డు ఈ నిఘంటువును అచ్చువేయించడానికి తిరస్కరించింది. అనంతరం 1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు.

మచిలీపట్నం జిల్లాకు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాలంలో మచిలీపట్నం కోర్ట్‌లో అమీనుగా ఉంటున్న తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి ద్వారా ద్వారా వేమన ప్రతిని పొంది ఆ తాళపత్ర ప్రతిలోని పద్యాలను కాగితాల మీదకు ఎక్కించాడు. 1825 ఏప్రిల్ 25 నాటికి ఆ పద్యాల చిత్తు పరిష్కరణ, ఆంగ్లీకరణ ముగించాడు. 1825లో ఆయన "విష్ణు పురాణం" చదివాడు. విష్ణు పురాణంలోని అహల్య చరిత్ర ఆయనను అమితంగా ఆకట్టుకుంది. వెంటనే మడికి సింగన ఆ ఘట్టాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వ్రాతప్రతులు పుట్టించడానికి, తీర్పు ప్రతులు సిద్ధపరచడానికి పద సూచికలు వ్రాయడానికి ఆయన కొలువులో ఎప్పుడూ 10 నుంచి 20 దాకా బ్రాహ్మణులు, శూద్రులు ఉండేవారు. ఇంతమంది విద్యావంతులు కృషిచేయబట్టే బ్రౌన్ ఆంధ్ర సాహిత్య సౌధాన్ని రూపొందించగలిగాడు.1837 లో " The Grammar of Telugu Language " అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. 1839లో ఈయన దృష్టి ద్విపద కావ్యాలపై పడింది. తెలుగు గ్రంధాలను సామాన్య కావ్యాలు, మహా కావ్యాలు అని రెండు వర్గాలుగా విభజించవచ్చన్నాడు. రామరాజు భూషణుడు రచించిన "వసుచరిత్ర"ను ఈయన అచ్చువేయించాడు. 1849లో తన స్వంత ఖర్చులతో "ఆముక్త మాల్యద" కు శబ్ద సూచిని తయారుచేయించాడు.

1849లో గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రం మీద నుంచి క్రిందపడి కుడి చేయి బ్రొటన వ్రేలు విరగడంతో బ్రౌన్ ఎడమ చేత్తో రాయడం సాధనచేసి నిఘంటువు ప్రూఫులను ఎడమచేత్తోనే దిద్ది అచ్చెరువొరచాడు. ఈయన మొత్తం 34 సంవత్సరాలపాటు కంపెనీ సర్వీసులో భారతదేశంలో ఉండి 3 దశాబ్దాలపాటు తెసుగు భాషా సరస్వతాలకే తన జీవితాన్ని అంకితం చేశాడు. తెలుగు ప్రజలంతా తనకు చదువు చెప్పిన గురువులే అని ఎంతో వినమ్రంగా చాటిన బ్రౌన్ తెలుగు సాహిత్యం ఉన్నంతవరకూ చిరంజీవిగా వెలుగొందుతాడు.

ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు.

Sunday, February 20, 2011

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

1. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం |2|

2. ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ
ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు |2|

3. మాత స్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తే
శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దాన శీల
ే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం

4. తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృష శైల నాథ దయితే దయానిధే

5. అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

6. పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

7. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని భుక్త్వా సలీల మథ కేళి శుకా ః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

9. తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

10. భృంగావళీచ మకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదై స్సహ సేవనాయా నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

11. యోషా గణేన వర దధ్ని విమథ్య మానే ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

12. పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

13. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

14. శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

15. శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

16. సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

17. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

18. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

19. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

20. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

21. శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

23. కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

24. మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

25. ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం

26. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభో విహంగాః శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం

27. బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

28. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

29. ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!

Thursday, February 10, 2011

ఆదిత్య హృదయం


తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్,
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్. 1

దైవతై శ్చసమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్,
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. 2

రామ! రామ! మహాబాహో! శృణు గుహ్యం సనాతనమ్,
యేన సర్వా నరీన్ వత్స! సమరే విజయిష్యపి. 3

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్,
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్. 4

సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్,
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థన ముత్తమమ్. 5


రశ్మిమంతం సముద్యంతం దేవాసర నమస్కృతమ్,
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్. 6

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః,
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. 7

ఏష బ్రహ్మో చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః,
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యాపాంపతిః. 8

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః,
వాయు ర్వహ్నిః ప్రజాఃప్రాణాః ఋతుకర్తా ప్రభాకరః. 9

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్,
సువర్ణసదృశో భానుః స్వర్ణ్యరేతా దివాకరః. 10

హరిదశ్వః సహస్రార్చిః సప్తపప్తిః మరీచిమాన్,
తిమిరోన్మథనః శంభు స్త్వష్టా మార్తాండకోంశుమాన్. 11

హిరణ్యగర్భః శిశిర స్తపనో భస్కరో రవిః
అగ్నిగర్భో దితేః పుత్త్రః శంఖః శిశిరనాశనః. 12

వ్యోమసాథ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః,
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లవంగమః. 13

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః,
క(ర)వి ర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః. 14

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్! నమోస్తుతే. 15

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 16

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః,
నమో నమ స్సహస్రాంశో అదిత్యాయ నమో నమః. 17

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః,
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. 18

బ్రహ్మోశా నాచ్యుతేశాయ సూర్యా యాదిత్యవర్చసే,
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. 19

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే,
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. 20

తప్తచామీకరాభఅయ వహ్నయే విశ్వకర్మణే,
నమస్తమో ఛినిఘ్నాయ రవయే లోకసాక్షిణే. 21

నాశయత్యేష వై భూత్ తదేవ సృజతి ప్రభుః,
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. 22

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః,
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చై వాగ్నిహోత్రిణామ్. 23

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతునాం ఫలమేవ చ,
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. 24

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ,
కీర్తయన్ పురుషః కశ్చి న్నావసీదతి రాఘవ!. 25

పూజయ స్త్వైన మోకాగ్రో దేవదోవం జగత్పతిమ్,
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. 26

అస్మిన్ క్షణే మహాబాహో! రావణం త్వం వధిష్యసి,
ఏవ ముక్త్యా తతో గస్త్యో జాగామ చ యథాగతమ్. 27

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా,
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయాతాత్మవాన్. 28

ఆదిత్యం ప్రేక్ష్యం జప్త్వేదం పరం హర్ష మవాప్తవాన్,
త్రిరాచమ్య శుచి ర్భూత్వా ధను రాదాయ వీర్యవాన్. 29

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్,
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్. 30

అథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
విశిచరపతి సంక్షయం విదిత్వాసురగణ మధ్యగతో వచ స్త్వరేతి. 31

రధ సప్తమి


సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీప
సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా!


లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.

రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరికి ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ.

వసంత పంచమి

సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. ఈ రోజు సరస్వతీ పూజకు ప్రశస్తంగా చెబుతారు దీనిని వసంత పంచమి అంటారు. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు.

వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు. శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారం లేకపోయినప్పటికీ, ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు.

మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.